Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాక్ మార్కెట్లకు సెబీ ఆదేశాలు
ముంబయి : స్టాక్ ఎక్సేంజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆందోళన వ్యక్తం చేసింది. ట్రేడింగ్ విషయంలో సాంకేతిక ఇబ్బందుల పేరుతో ఇన్వెస్టర్లను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. నాలుగు గంటలకు మించి టెక్నికల్ సమస్యలు కొనసాగితే భారీగా జరిమానాలు విధిస్తామని తెలిపింది. టెక్నికల్ సమస్యలను 30 నిమిషాల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. లేనిచో రూ.2 కోట్ల వరకు జరిమానా విధించనున్నట్టు తెలిపింది.