Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిజోరంనకు కంభంపాటి హరిబాబు
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితు లయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది గవర్నర్లలో ..నలుగురు కొత్త వారికి చోటు దక్కింది. మరో నలుగురికి స్థానభ్రంశం కల్పించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. మిజోరం గవర్నర్గా ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగూభారు ఛగన్భారు పటేల్, కర్నాటక గవర్నర్గా కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా రాజేంద్రన్ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్గా పిఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్గా రమేశ్ బైస్ నియమితులయ్యారు.