Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకెప్పుడూలేని రీతిలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. తాజాగా చమురు కంపెనీలు లీటరు పెట్రోల్పై 35 పైసలు, లీటరు డీజిల్పై 17 పైసలను పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్కతా నగరంలో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటింది. బుధవారం పెరిగిన చమురు ధరలతో ఢిల్లీలో మొదటి సారిగా లీటరు పెట్రోల్ ధర రూ.100.21కు పెరిగింది. లీటరు డీజిల్ ధర రూ.89.53కు చేరింది. బెంగాల్ రాజధాని కోల్కతాలో పెట్రోల్ ధర రూ.100.23, డీజిల్ రూ.92.50కు పెరిగింది. దీంతో మొదటి సారి దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్ ధ రూ.100 మార్క్ను దాటింది.