Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా : హిమాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ (87) గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్, జూన్లో రెండుసార్లు కరోనా బారినపడి కోలుకున్నారు. సోమవారం గుండెపోటు రావడంతో ఇక్కడి ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్పై చికిత్స పొందుతూ గురువారం ఉదయం 3.40 గంటలకు కన్నుమూశారని సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్ తెలిపారు. ఆయన భౌతిక కాయం సిమ్లాలోని లోవర్ జాకు ప్రాంతంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎంపిగా గెలిచిన ఆయన ఆరు పర్యాయాలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.