Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో అత్యున్నత పదవి అయిన ఛైర్మన్ హోదాను రద్దు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ స్థానంలో ఇక చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పదవులను ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు ఎల్ఐసీలోని వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించనున్న నేపథ్యంలో చైర్మెన్ హోదాను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఎల్ఐసీ చట్టం 1956లోనూ ఆర్థిక శాఖ కొన్ని మార్పులు చేసింది. ఎల్ఐసీ లిస్టింగ్కు వీలు కల్పించేందుకు ఆర్థిక శాఖ సెక్యురిటీస్ కాంట్రాక్స్కు సంబంధించిన నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా ఎల్ఐసిలోని 5 శాతం వాటాలను కేంద్రం విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. షేర్ల విక్రయ సమయంలో పాలసీదారులకు 10 శాతం వాటాలు కేటాయించే అవకాశాలున్నాయి.