Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణలోని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డి.చంద్రమౌళీశ్వరరెడ్డి సహా తొమ్మిది మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ కె.రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ట్రిబ్యునల్ విచారించింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది పిఎస్ రామన్ వాదనలు వినిపిస్తూ.. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ తాగునీటి సరఫరా వరకే పరిమితం అవుతామని పేర్కొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు కమిటీ ఏర్పాటుచేసి నివేదిక కోరాలని ధర్మాసనం నిర్ణయిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 29కి వాయిదా వేసింది. కమిటీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉన్నది.