Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్పై 34 పైసలు పెంపు.. డీజీల్ యథాతథం
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు రోజుల విరామమనంతరం లీటర్ పెట్రోల్పై 26 నుంచి 34 పైసల మేర ధరలు పెరిగాయి. డీజీల్ ధరలలో మాత్రం పెరుగుదల లేదు. కాగా, గత రెండు నెలల్లో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెంచిన ధరల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.84గా నమోదైంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.83గా, కోల్కతాలో రూ. 102.80గా రికార్డయ్యింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 102.49కి ఎగబాకింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ 105.25కు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83కి చేరింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలతో సంబంధం లేకుండా దేశంలో ఇంధన ధరలు పెరుగుతుండటంపై దేశంలోని ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు నియంత్రించడంలో విఫలమైన మోడీ సర్కారుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.