Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : సుప్రీంకోర్టు మందలింపుతో.. యోగి ప్రభుత్వం కన్వర్ యాత్రను రద్దు చేసింది. కన్వర్ సంఘాలతో చర్చలు జరిపాక.. ఈ ఏడాది యాత్రను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక రోజు ముందు, దేశ అత్యున్నత న్యాయస్థానం యోగి ప్రభుత్వాన్ని తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరింది. గతేడాది కూడా కన్వర్ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం యాత్రను నిలిపేసింది.కన్వర్ యాత్రను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాలతో చర్చలు జరపాలని అదనపు ముఖ్య కార్యదర్శి హౌమ్ అవ్నిష్ అవస్థీ, డైరెక్టర్ జనరల్ పోలీస్ ముకుల్ గోయల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.