Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణంలో ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ''నేను అన్ని పార్టీలు, ఎంపీలు హౌస్లో చాలా కష్టమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నాను. కాని క్రమశిక్షణా వాతావరణంలో ప్రభుత్వం స్పందించడానికి అనుమతించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచుతుంది. ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. అభివృద్ధి మార్గాన్ని మెరుగుపరుస్తుంది'' అని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ మిమ్మల్ని బాహుబలిగా మారుస్తుందనీ, కనుక ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని కోరారు. అలానే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ''భుజాలకు టీకా తీసున్నవారంతా బాహుబలిగా మారతారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క డోస్ టీకా అయినా తీసుకుని బాహుబలులుగా మారారు. వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దీని గురించి పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని ఆశిస్తున్నాను. అలాగే కరోనా కట్టడి చర్యలపై ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడుతున్నాను. ఈ సమావేశాల్లో నేను అదే చేయాలనుకుంటున్నాను. ఈ పార్లమెంట్ సమావేశాలు ఫలవంతంగా సాగాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నాను. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం'' అని మోడీ అన్నారు.