Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకులు ఆశా వర్కర్లతో ఏర్పాటు
- ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగం
- అసోం ముఖ్యమంత్రి ప్రకటన
గువహతి : ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో గర్భనిరోధక మందుల పంపిణీకి, జనాభా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు జనాభా నియంత్రణ సైన్యాన్ని వినియోగించనున్నట్టు అసోం ప్రభుత్వం తెలిపింది. అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వెయ్యిమంది సైనికులతో కూడిన బృందాలను దిగువ అసోం ప్రాంతాలకు కేటాయించను న్నట్టు వెల్లడించారు. ఈ వెయ్యి మంది యువకులతో పాటు ఆశా వర్కర్లను కూడా ఈ కార్యక్రమానికి వినియోగించనున్నట్టు తెలిపారు. దిగువ అసోంలోని అధిక జనాభా కారణంగా ఇక్కడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎగువ అసోంలోని ప్రజలకు సంబంధం ఉండదనీ, రాష్ట్రంలో జనాభా నియంత్రణపై అవగాహన కల్పించడం ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలోని సెంట్రల్, పశ్చిమ ప్రాంతాల్లో ముస్లిం జనాభా అత్యధికంగా పెరిగిపోతున్నట్టు అసెంబ్లీకి తెలిపారు. రాష్ట్రంలో 2001-2011 మధ్య హిందువుల జనాభా పెరుగుదల కేవలం పది శాతం ఉండగా, ముస్లిం జనాభా పెరుగుదల 29శాతంగా ఉందని అన్నారు. మిత జనాభా కారణంగా హిందువుల జీవన శైలి మెరుగ్గా ఉందనీ, విశాలమైన నివాసాలు, వాహనాలు కలిగి ఉన్నారని చెప్పారు. అలాగే వారి సంతానంలో అధిక శాతం మంది వైద్యులు, ఇంజనీర్లుగా కొనసాగుతున్నారని అన్నారు. కాగా, ముస్లింలే లక్ష్యంగా యూపీలోని యోగి ఆధిత్యనాథ్ వివాదాస్పద జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అసోంలోని ఈ వివాదాస్పద నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.