Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమానాశ్రయాల్లో నిబంధనలకు పాతర : ఏఏఐ కమిటీ నిర్ధారణ
ముంబయి : కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూపు కంపెనీల అక్రమాలకు ఎర్రతివాచీ పరిచినట్లయ్యింది. గౌతం అదానీకి చెందిన కంపెనీలు పదే పదే అతిక్రమిస్తున్న నిబంధనలకు లెక్కలేకుండా పోతున్నది. మారిషస్ కేంద్రంగా ఒకే చిరునామా కలిగిన ఆరు హవాలా కంపెనీలు అదానీ గ్రూపులో వేల కోట్ల పెట్టుబడులపై విచారణ కొనసాగుతుండ గానే తాజాగా విమానాశ్రయాల్లో అదానీ కంపె నీల నిబంధనల అతిక్రమణల ప్రచార (బ్రాం డింగ్) పద్దతులు నిరూపితమయ్యాయి. ప్రతీ కమిటీలో అదానీ గ్రూపు ఎగ్జిక్యూటివ్, ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ అధికారి, ఇద్దరు ఏఏఐ అధికారులతో వేరు వేరుగా మూడు కమిటీలను వేశారు. ఈ కమిటీలు అదానీ గ్రూపు బ్రాండింగ్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించాయి. మోడీ ప్రభుత్వం విమానాశ్రయాల ప్రయివేటీకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది అంతర్జాతీయ, రీజినల్ ఎయిర్పోర్ట్లను అదానీ గ్రూపుకు అప్పగించింది. ఈ సంస్థ నిర్వహిస్తోన్న అహ్మదాబాద్, మంగుళూరు, లక్నో విమానాశ్రయాల్లో రాయితీ ఒప్పందాలలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సూచించిన లోగో బ్రాండింగ్ నిబంధనలను ఉల్లఘిస్తున్నట్లు తాజాగా ఏఏఐ ఏర్పాటుచేసిన మూడు కమిటీలు నిర్దారించాయి. మూడు విమానాశ్రయాల నిర్వహణ కోసం 2019 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ బిడ్లను గెలుచుకుంది. ఎయిర్పోర్టుల నిర్వహణ కోసం ఫిబ్రవరి 2020లో ఏఏఐతో అదానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నవంబర్ 2020 నుంచి ఎయిర్పోర్టుల నిర్వహణను అదానీ గ్రూప్స్ తీసుకున్నాయి.
తాజాగా ఏఏఐ కమిటీలు నిర్వహించిన తనిఖీల్లో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్పోర్టులో బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్నట్టు గుర్తించాయి. హోర్డింగ్లు, డిస్ప్లే విషయాల్లో ఏఏఐ సూచనలను అదానీ గ్రూప్స్ ఉల్లంఘించినట్టు గుర్తించాయి. అదే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ లోగోలను ప్రదర్శించడంలోనూ అదానీ గ్రూప్స్ నిబంధనలు పాటించలేదు. ఏఏఐతో ఒప్పందం సమయంలో చేసుకున్న నిబంధనలకు అనుగుణంగా డిస్ప్లే బోర్డులను వేస్తామని అదానీ గ్రూపు పేర్కొంది.