Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాల విషయంలో నిరసనలు చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి దిగొచ్చారు.
రైతులను పోకిరీలు అని పిలిచినందుకు వారికి క్షమాపణలు చెప్పారు. జంతర్మంతర్ ఘటన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీనాక్షి లేఖి రైతులపై నోరుపారేసుకున్నారు. అయితే, ఆమె వ్యాఖ్యలపై సామాజిక మాద్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై రైతులు, రైతు సంఘాల నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది.