Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
ముంబయి : మహారాష్ట్రలో ఆరు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారానికి 138కు చేరుకున్నట్టు రాష్ట్ర విపత్తుల, పునరావస శాఖ మంత్రి విజరు వాడేత్తివార్ ప్రకటించారు. మృతుల్లో ఎక్కువ మంది కొండ చరియలు విరిగిపడి మరణించిన వారే ఉన్నారు. కేవలం రారుఘడ్ జిల్లాలోనే 47 మంది కొండచరియలు పడి మరణించారు. కేవలం తలియే గ్రామంలోనే 37 మంది మరణించగా, జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో 10 మంది మరణించారు. రాష్ట్రంలో 54 గ్రామాలు పూర్తిగా వరద ప్రభావానికి గురికాగా, 821 గ్రామాలు పాక్షికంగా వరద ప్రభావానికి గురయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో ఇప్పటి వరకూ 89,333 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొల్హాపూర్ జిల్లాలోనే 40,882 మందిని తరలించారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహా రం ఇవ్వనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారి ఆసుపత్రుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ రాక్రే ఒక ప్రకటనలో తెలిపారు.