Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా
న్యూఢిల్లీ : భారత్లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు సెప్టెంబర్ నుంచి ఆందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ఇది అతి ముఖ్యమైన చర్య అని ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జైడస్ చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించిందనీ, అత్యవసర అనుమతుల కోసం వేచిచూస్తున్నదని అన్నారు. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ ట్రయల్స్ ఆగస్టు, సెప్టెంబర్లోపు పూర్తవుతాయనీ, వెంటనే అనుమతులు పొందవచ్చని అన్నారు. అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ను ఇప్పటికే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదించిందని చెప్పారు. దీంతో సెప్టెంబర్ నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ను ప్రారంభించవచ్చని భావిస్తున్నామన్నారు. దేశంలో ఇప్పటివరకు 42 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లను అందించామనీ, ఈ ఏడాది చివరి నాటికి పెద్దలందరికీ వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. అయితే థర్డ్వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో.. చిన్నారులకు వ్యాక్సిన్లను అందించడంపై స్పష్టతనివ్వలేదు. 11-17 ఏండ్లలోపు పిల్లలతో కలిసి జీవించే వద్ధుల్లో వ్యాధి సోకే ప్రమాదం 18-30 శాతం ఉంటుందని ఈ వారం ప్రారంభంలో లాన్సెట్ ఒక అధ్యయనాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గులేరియా స్పందిస్తూ.. వద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాధి సొకే ప్రమాదం అధికంగా ఉందని అన్నారు. చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. స్వల్పంగా వ్యాధి సోకిన చిన్నారులు వద్ధులకు వ్యాప్తి చేయవచ్చనీ... అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.