Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములాయంతో భేటీ
న్యూఢిల్లీ : దేశానికి ప్రసుత్తం సమానత్వం, సోషలిజం అవసరమనీ.. పెట్టుబడిదారీ విధానం, మతతత్వం ఎంతమాత్రం కాదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత లాలూప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. లాలూ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్తో సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎస్పీ అధినేత అఖిలేష్ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు భేటీకి సంబంధించిన ఫొటోలను లాలూ ట్విట్టర్లో పోస్టు చేశారు. ''దేశంలోనే సీనియర్ సోషలిస్టు స్నేహితుడు ములాయంసింగ్ను కలిశాను. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. రైతుల సమస్యలు, నిరుద్యోగం, అసమానతలు, పేదరికం తదితర అంశాలపై మాకు ఒకే విధమైన ఆందోళన ఉంది'' అని పేర్కొన్నారు.