Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 మంది అరెస్ట్.. 243 మందిని విచారించిన పోలీసులు
- హైకోర్టుకు నివేదిక అందజేసిన సిట్
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణంపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టుకు తన నివేదికను అందజేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 243 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారించారు. విచారణ అనంతరం వారిని విడిచిపెట్టినట్టు తెలిపారు. పలు చోట్ల సోదాలు నిర్వహించి 17 మందిని అరెస్టు చేశారు. అలాగే, 250 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ ఎస్పీ సంజీవ్ కుమార్ వెల్లడించారు. జిల్లాలోని 53 హౌటళ్లలో సోదాలు జరిపి, జడ్జి మరణానికి సంబంధమున్న 17 మందిని అరెస్టు చేసి, కేసులు పెట్టామన్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో జడ్జిని ఢకొీట్టిన ఆటోను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామనీ, ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్లో ఎటువంటి పత్రాలు లేని 250 ఆటోలను పట్టుకున్నట్టు వివరించారు. జడ్జి మరణ ఘటన సీసీ టీవీ ఫుటేజీని బహిర్గత పరిచినందుకు పోలీస్ సబ్ ఎన్స్పెక్టర్ ఆదర్శ్ కుమార్ను, ఆటో చోరీ ఫిర్యాదుపై రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేసినందుకు గాను పథర్ది పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఉమేశ్ మాంఝిని సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు గురువారం ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతని సహాయకుడు రాహుల్ వర్మను అరెస్ట్ చేశారు. కాగా, జార్ఖండ్ హైకోర్టు జడ్జి మరణంపై దృష్టి సారించింది. వేగవంతమైన, న్యాయపరమైన దర్యాప్తు కావాలనీ, ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ నెల 3 లోపు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.