Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. తొమ్మిదేండ్ల చిన్నారి అనుమానాస్పద రీతిలో మృతిచెందటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ కాటికాపరి సహ నలుగురిని పోలీసులు అరెస్టుచేశారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్యచేశారనీ, పోలీసులకు తెలియకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని పాతనంగల్ గ్రామంలో ఆదివారం ఈ ఘోరం జరిగింది. బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే నివసిస్తున్నది. అక్కడ ఉన్న వాటర్కూలర్ నుంచి నీళ్లు తెచ్చేందుకు ఈ చిన్నారి వెళ్ళింది. దాదాపు గంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్ ఆమె తల్లి వద్దకు వచ్చి విద్యుద్ఘాతంతో బాలిక మరణించినట్టు చెప్పాడు. పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్టుమార్టం పేరుతో ఇబ్బంది పెడతారని చెప్పి బలవంతంగా మతదేహానికి అంత్యక్రియలు చేయించాడు. బాలిక తండ్రికి విషయం తెలిసి పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు అక్కడ కాలిపోయిన బాలిక కాళ్లు మాత్రమే లభ్యమయ్యాయి. బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు పోలీసులు చెప్పారు.