Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెగాసస్ నిఘా వ్యవహారం సహా పలు అంశాలపై పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. వెల్లోకి వెళ్లి ప్లకార్డులు చేబూని ఆందోళన చేపట్టారు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభ్యులు వెల్ వద్దకు దూసుకురావటంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఎగువ సభను మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఆ తరువాత రెండు గంటలకు వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్సభలోనూ ఇదే వైఖరి కనిపించింది. పలు అంశాలపై చర్చజరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో.. స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. ఆ తరువాత తిరిగి ప్రారంభమైనప్పటికీ..అదే రగడ కొనసాగడంతో రెండోసారి రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన ఉభయ సభల్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో బుధవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలో దివాలా కోడ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.