Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీ ఎయిర్టెల్ సీఈఓ గోపాల్
న్యూఢిల్లీ : భారత టెలికం పరిశ్రమలో కనీసం మూడు ప్రయివేటు టెలికం కంపెనీలు ఉండాలని భారతీ ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. 130 కోట్ల మంది జనాభా కలిగిన సువిశాల దేశంలో మూడు ప్రయివేటు టెల్కోలతో పాటుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా పరిణామాల నేపథ్యంలో గోపాల్ ఈ ప్రకటన చేయడం విశేషం. ఏజీఆర్ బకాయిలను 2022 మార్చిలో చెల్లించలేమని ఓ టెలికం సంస్థ పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి టెలికం కంపెనీలకు ఉపశమన చర్యలు అవసరమని భావిస్తున్నామన్నారు. ప్రతీ వినియోగదారుడి నుంచి నెలకు సగటు ఆదాయం తొలుత రూ.200కు తదుపరి రూ.300కు చేరాల్సిన అవసరం ఉందన్నారు. ఒత్తిడిలో ఉన్న ఈ పరిశ్రమకు ఆర్థిక మద్దతు చర్యలు అవసరమన్నారు.