Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిఎం యోగి అదిత్యనాధ్పై పోటీకి రాష్ట్ర కేడర్కు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ సై అంటున్నారు. ఉద్యోగానికి ముందస్తు పదవీ విమరణ చేసిన ఆయన రానున్న ఎన్నికల్లో యోగిపై పోటీ చేస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇది విలువల కోసం అమితాబ్ చేస్తున్న పోరాటం అని ఆయన భార్య నూతన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా యోగి ఆధిత్యానాధ్ తన పాలన కాలంలో అనేక అప్రజాస్వామిక, అక్రమ, అణచివేత, వేధింపు, వివక్షాపూరిత చర్యలు చేపట్టారని విమర్శించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీచేసిన వ్యతిరేకంగా నిలబడేందుకు అమితాబ్ నిర్ణయం తీసుకున్నారని, ఈ పోటీద్వారా యోగి తప్పుడు విధానాలను ఎత్తిచూపుతామని అన్నారు.