Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూను ఈ నెల 21వ తేది వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
1,506 కరోనా కేసులు
మరోవైపు 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,506 మందికి కొత్తగా కరోనా సోకింది. 16 మంది చనిపోయారు. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు 65,500 మందికి పరీక్షలు నిర్వహించారు. 1835 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అత్యధికంగా తూర్పుగోదావరిలో 319, చిత్తూరులో 217 కేసులు నమోదు కాగా అత్యల్పంగా కర్నూల్లో 15, అనంతపురంలో 23 కేసులు నమోదయ్యాయి.