Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీఘర్ : పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్యకర్తలకు పగలు, రాత్రి అందుబాటులో ఉంటానని, అందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నానని గతంలో ప్రకటించారు. ఆ హామీ మేరకు పార్టీ కార్యాలయంలో బెడ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంత్రులు కూడా కనీసం మూడు గంటలు ఇక్కడ ఉండి ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య పొరపాచ్ఛాలు ఇంకా సద్దుమణగలేదని తెలుస్తోంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెతిపోస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నవారిపై అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని సిద్ధు ఆరోపిస్తున్నారు.