Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.694 నుంచి 859 వరకు ఎగబాకిన ధరలు
- మూడేండ్లలో రూ. 4,315 కోట్ల ఎక్సెజ్ సుంకం వసూలు
న్యూఢిల్లీ : దేశంలో వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. 1 జనవరి 2021 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు వంట గ్యాస్ ధర పెరిగింది.
వంట గ్యాస్ ధర జనవరి 1న రూ.694 ఉండగా, ఇప్పుడు రూ.859కు ఎగబాకింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.25 పెరిగింది. ఆగస్టు 17 నుంచే పెరిగిన ధర అమలులోకి వచ్చింది. అయితే ఎల్పీజీ సిలిండర్ ధర జనవరి రూ. 694 ఉండగా, ఫిబ్రవరి 4న రూ.719కి పెరిగింది. ఫిబ్రవరి 15న రూ.769కి పెరిగింది. ఫిబ్రవరి 25న రూ.794కి పెరిగింది. మార్చి 1న రూ.819కి ఎగబాకింది. జులై 1న రూ.834కి పెరిగింది. ఆగస్టు 17న రూ.859కి ఎగబాకింది. జులై 1న ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25.50కి పెరిగింది. వంట గ్యాస్ ధర పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సెజ్ డ్యూటీ ప్రధాన కారణం.
గత మూడేండ్లలో రూ. 4,315 కోట్లు ఎక్సెజ్ డ్యూటీని వసూళ్లు కేంద్ర ప్రభుత్వ వసూలు చేసింది. 2018-19లో రూ. 1,547 కోట్లు, 2019-20లో రూ. 1,573 కోట్లు, 2020-21లో రూ. 1,195 కోట్లు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై ఎక్సెజ్ సుంకాన్ని వసూళ్లు చేసినట్టు పార్లమెంట్లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానం ఇచ్చారు.