Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ హామీల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమైనది
- సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ : అరెస్టులు, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. అరెస్టులు చేయడానికి చట్టాలు అనుమతించినంత మాత్రాన.. ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేసేందుకు ఆ అధికారాన్ని విచక్షణారహితంగా ఉపయోగించుకోమని అర్థం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజ్యాంగం ఇచ్చిన హామీల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమైనదని, అరెస్టులు రొటీన్(నిత్యకృత్యం)గా జరగకూడదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, హృషికేష్ రారులతో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఏడేండ్ల క్రితం ఎఫ్ఐఆర్ దాఖలైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వ్యాపారవేత్త సిద్ధార్ధ్ దాఖలు చేసిన పిటిషన్ను కొటేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజా ఉత్వర్వులు జారీచేసింది. అరెస్టులు అనేవి సాధారణంగా చోటుచేసుకుంటే.. అది ఆ వ్యక్తి ప్రతిష్ట, అత్మగౌరవానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి.. నిందితుడు పరారవుతాడని లేదా సమన్లను బేఖాతరు చేయరని భావిస్తే అటువంటి సమయంలో అతను లేదా ఆమెను కోర్టు ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. నిందితుడిపై కస్టడీ విచారణ అవసరం అనుకున్నప్పుడు, క్రూరమైన నేరానికి పాల్పడినప్పుడు, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం లేదా పరారయ్యే అవకాశం ఉందని భావించే సమయంలో మాత్రమే విచారణ జరుగుతుండగా అరెస్టులు అనేవి చోటుచేసుకోవాలని తెలిపింది. సీఆర్పీఎసీ సెక్షన్ 170లో కనిపించే 'కస్టడీ' అనే పదం పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీ గురించి పేర్కొనదనీ, చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో దర్యాప్తు అధికారి నిందితులను కోర్టు ముందు హాజరుపరచడాన్ని ఇది సూచిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చాీట్ దాఖలు చేసే సమయంలో నిందితుడిని అరెస్టు చేసే బాధ్యతను ఈ సెక్షన్ సంబంధిత అధికారిపై విధించదని తెలిపింది.