Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రావ్సాహెబ్ దన్వే.. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ గాంధీతో ఎవరికీ ఉపయోగం లేదని ఆయనను ఒక వీధి పశువుతో పోల్చాడు. 'జన్ ఆశీర్వాద్ యాత్ర' లో భాగంగా మహారాష్ట్రలోని జల్న జిల్లాలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ ఆయనపై వ్యాఖ్యలుచేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. దన్వేను వెంటనే కేంద్ర క్యాబినేట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దన్వే తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహారాష్ట్ర యూనిట్ చీఫ్ నానా పటోలే తెలిపారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు.