Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం : విశాఖ జిల్లా అనంతగిరి జెడ్పిటిసిగా సీపీఐ(ఎం) అభ్యర్థి దీసరి గంగ రాజు విజయం సాధించారు. మొత్తం 18,368 ఓట్లకు గంగరాజుకు 7339, వైసీపీ అభ్యర్థి స్వామికి 6861, టిడిపి అభ్యర్థికి 2135 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసిపి అభ్యర్థిపై 478 ఓట్ల మెజార్టీతో గంగరాజు గెలుపొందారు. గంగరాజు గతంలో అనంతగిరి మండల కేంద్రం ఎంపీటీసీగా పనిచేసి గిరిజనుల మన్ననలు పొందారు. తాగునీరు, రహదారుల ఏర్పాటుపై విశేష కృషిచేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కరించేందుకు పోరాటాలు నిర్వహించారు.