Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పచ్చజెండా
- పది రోజుల్లో అధికారిక నోటిఫికేషన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ) 11వ మహారత్నగా మారనుంది. ఈ మేరకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. గత వారం సమావేశం అయిన ఈ కమిటీ పీఎఫ్సీకి మహారాత్న హౌదా ఇచ్చేందుకు ఆమోదించిందని అందులోని సభ్యులు తెలిపారు. పీఎఫ్సీ, ఆర్ఈసీ లిమిటెడ్ వంటి విద్యుత్ రంగ రుణదాతలను రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ కంపెనీలు (డిస్కం)లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. మెగా సీపీఎస్ఈలు ప్రపంచ దిగ్గజాలుగా మారడానికి మహారత్నని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మహారత్న హౌదా పొందిన తరువాత విలీనాలు, కొనుగోళ్లు జరుగుతాయి. పీఎఫ్సీ, దేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ), 14 నవరత్న సీపీఎస్ఈల్లో ప్రభుత్వం చేపట్టే మెరుగైన అధికారాలను మంజూరు చేయడమే కాకుండా ఒకే ప్రాజెక్టులో రూ. 5,000 కోట్ల వరకు లేదా, దాని నికర విలువలో 15 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చని తెలిపింది. నవరత్న, మినీరత్న సీపీఎస్ఈలు వరుసగా రూ.1,000 కోట్లు, రూ. 500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని కేంద్రం తెలిపింది.
''మహారత్న హౌదా కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పీఎఫ్సీని క్లియర్ చేసింది. అధికారిక నోటిఫికేషన్ దాదాపు 10 రోజుల్లో జారీ చేయబడుతుందని భావిస్తున్నాం'' అని ఆ సభ్యుడు పేర్కొన్నారు. సీపీఎస్ఈ నవరత్న హౌదా రావాలంటే, ఆ సంస్థ భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో జాబితా అవ్వాలి. అలాగే సగటు వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లు, నికర లాభం రూ. 5,000 కోట్లు కలిగి ఉండాలి. అలా మూడేండ్ల పాటు ఉంటే, దానికి మహారత్న హౌదా ఇవ్వబడుతుంది. దేశంలో ప్రస్తుతం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి 10 మహారత్న సీపీఎస్ఈలు ఉన్నాయి. అలాగే దేశంలో 14 నవరత్నాలు, 73 మినీరత్న సీపీఎస్ఈలు ఉన్నాయి.
జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో పీఎఫ్సీ నికర లాభంలో 34 శాతం పెరుగుదల రూ.2,274 కోట్లకు చేరింది. త్రైవాసికంలో ఆర్ఈసీ లిమిటెడ్ తన నికర లాభంలో 22 శాతం పెరుగుదలను రూ.2,247 కోట్లకు నమోదు చేసుకుంది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇటీవల రూ. 3.03 ట్రిలియన్ల పవర్ డిస్కమ్ సంస్కరణ పథకాన్ని ఆమోదించింది. దీని కింద కేంద్ర ప్రభుత్వం రూ. 97,631 కోట్ల భారం భరిస్తుందని క్యాబినెట్ కమిటీ తెలిపింది. ఈ పథకం అమలు కోసం నోడల్ ఏజెన్సీలుగా ఆర్ఈసీ, పీఎఫ్సీ నామినేట్ చేసింది. పీఎఫ్సీ ఇటీవల భారీగా బాండ్లను విక్రయించింది.