Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు పైలట్ల మృతి
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. పట్నితాప్ సమీపంలోని కొండ ప్రాంతంలో మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. ప్రమాదమ నంతరం తీవ్ర గాయాలపాలైన పైలెట్లను గుర్తించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారిం చారని అధికారులు తెలిపారు. ఘటనా సమయంలో అక్కడ ప్రతికూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. మరణించిన రోహిత్కుమార్, అనుజ్ రాజ్పుత్ అనే ఇద్దరు పైలెట్లు మేజర్ ర్యాంకు అధికారులని ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్పుత్ విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేశారని ఆర్మీ నార్త్ కమాండ్ ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించింది. కొండ ప్రాం తంపై కూలిన అనంతరం ధ్వంసమైన హెలికాప్టర్, పైలెట్లను బయటకు తీసేం దుకు స్థానికుల ప్రయత్నాలకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఘటనపై కేంద్ర మంత్రి జితేంత్ర సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఆర్మీ హెలికాప్టర్ కూలిన వార్త తెలిసి కలత చెందానన్నారు.
జమ్ముకాశ్మీర్లో గత ఏడు వారాల వ్యవధిలో హెలికాప్టర్ కూలిన ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. గత నెలలో రంజిత్ సాగర్ డ్యామ్లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించగా, ఇంకా ఒకరి మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.