Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబాలకు పరామర్శ
న్యూఢిల్లీ: అసువులు బాసిన త్రివిధ దళాల సారథి రావత్, ఆయన భార్య సహా 13 మందికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అమరజవాన్ల భౌతిక కాయాల వద్ద ఆయన పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే ఉన్న అమరజవాన్ల కుటుంబసభ్యుల ను మోడీ పరామర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్తో పాటు పలువురు మంత్రులు, సైన్యాధికారులు కూడా అమరజవాన్లకు నివాళులర్పించారు.
రేపు సీడీఎస్ రావత్ అంత్యక్రియలు
ప్రజల సందర్శనార్థం రావత్ భౌతికకాయన్ని అందుబాటులో ఉంచుతారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రావత్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.