Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్/ జైపూర్ : జమ్ముకాశ్మీర్లో చలి పంజా విసురుతోంది. సగటు కన్నా ఉష్ణోగ్రతలు పడిపోతు న్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు న్నారు. అక్కడి వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయని తెలిపారు. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు ఉండే పహల్గావ్లో ఏకంగా మైనస్ 8.7 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శ్రీనగర్లో ఆదివారమూ మైనస్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, బారాముల్లా జిల్లా గుల్మార్గ్ తదితర ప్రాంతాల్లో మైనస్ 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు కాశ్మీర్లో ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. శ్రీనగర్లో గత రాత్రి 2.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందనీ, డిసెంబర్ 18న ఇక్కడ నమోదైన ఉష్ణోగ్రత -6 డిగ్రీల సెల్సియస్, ఇది ఈ సీజన్లో అత్యల్పంగా ఉన్నది.ఇటు రాజస్తాన్లో సైతం మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫతేపూర్లో అత్యల్పంగా మైనస్ 4.7 డిగ్రీల సెల్సియస్, చురులో మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్, సికార్లో మైనస్ 2.5 డిగ్రీల సెల్సియస్, అమృత్సర్లో మైనస్ 0.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.