Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సమతామూర్తి' విగ్రహం తయారీ అక్కడే
- రూ. 135 కోట్ల ఖర్చు.. చైనా సంస్థ ఏరోసన్తో కాంట్రాక్టు
న్యూఢిల్లీ : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' (సమతామూర్తి విగ్రహం) తయారీ చైనాలో జరిగింది. చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ ఈ విగ్రహ తయారీ కాంట్రాక్టును దక్కించుకున్నది. ఇందుకు దాదాపు రూ. 135 కోట్ల ఖర్చయ్యింది. శనివారం హైెదరాబాద్కు వచ్చిన ప్రధాని మోడీ రామానుజుడి విగ్రహాన్ని (సమతామూర్తి విగ్రహాన్ని) ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. 216 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన విగ్రహం తయారీ కాంట్రాక్టును దక్కించుకోవడానికి ఒక భారతీయ కంపెనీ కూడా పోటీలో ఉన్నది. చివరకు చైనాకు చెందిన ఏరోసన్ కంపెనీకి విగ్రహ తయారీ ఆర్డర్ను 2015 ఆగస్టులో ఇచ్చారు. ఈ మేరకు ఏరోసన్ కంపెనీతో కాంట్రాక్టు కుదిరింది. ఈ కాంట్రాక్టుపై మై హౌం గ్రూప్ ఆప్ ఇండిస్టీస్ చైర్మెన్ జూపల్లి రామేశ్వర్రావు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఆర్గనైజర్స్ తరఫున సంతకం చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న సమతా-కేంద్రం 45 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఈ భూమిని జూపల్లి దానం చేశారు. విగ్రహ తయారీలో భాగంగా కాస్టింగ్ పనులు చైనాలో జరిగాయి. మొత్తం 1600 ల భాగాలతో విగ్రహాన్ని ఇక్కడకు (భారత్కు) తీసుకొచ్చారు. విగ్రహ ఏర్పాటు ప్రక్రియ 2017-18లో మొదలైంది. ఇందుకు 15 నెలల సమయం పట్టింది.