Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కార్యకర్తల కిరాతకం
బెలోనియా : త్రిపురలో బీజేపీ గూండాల అరాచకాలకు మరో సీపీఐ(ఎం) కార్యకర్త బలయ్యాడు. దక్షిణ త్రిపుర జిల్లా బెలోనియా పట్టణంలోని కమలాపూర్ బజార్లో గురువారం సాయంత్రం బిజెపి గూండాల దాడిలో సిపిఎం కార్యకర్త బెనూ బిశ్వాస్ (40) ప్రాణాలు కోల్పోయారు. కమల్పూర్ బజారుకు సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన బిశ్వాస్పై బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దీంతో, తీవ్రంగా గాయపడిన బిశ్వాస్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హత్యకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. గడచిన రెండేళ్లలో బీజేపీ గూండాల దాడుల్లో 24 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించింది. బిశ్వాస్ మృతికి సంతాపం తెలుపుతూ, ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేసింది.