Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం ఉదయం 5.03 గంటలకు ఉత్తరకాశీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో.. 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో భూకంపం రావడం ఇది మూడోసారి. గత ఆదివారం ఉదయం 11.27 గంటలకు 4.1 తీవ్రతో భూమి కంపించింది. అంతకుముందు రోజు (ఫిబ్రవరి 5న) కూడా 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.