Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రితం రోజు కన్నా 13 శాతం తక్కువ
న్యూఢిల్లీ : కరోనా కేసులు 50 వేలకు దిగి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 14.50 లక్షల మందికి కరోనా పరీక్షలు చేపట్టగా 50,407 మందికి కరోనా ఉన్నట్లు తేలిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. క్రితం రోజు కన్నా 13 శాతం తక్కువ. తాజాగా 804 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 4.25 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 5,07,981 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,443కు చేరుకున్నాయి. మొత్తం కేసులో యాక్టివ్ కేసుల రేటు 1.43 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 3.48శాతానికి పడిపోయింది. గడిచిన24 గంటల్లో 1,36,962 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు కోవిడ్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.14 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 172 కోట్ల వ్యాక్సిన్ డోసుల వినియోగం అయ్యాయి.