Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు దేశవ్యాప్త ఆందోళన దినం
- ఎస్ఎఫ్ఐతో సహా విద్యార్థి సంఘాల పిలుపు
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని అలియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నేత అనీష్ ఖాన్ ఫిబ్రవరి 18న తృణమూల్ కాంగ్రెస్ మూకలు అతని నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యాడనీ, ఆయన హత్యకు నిరసనగా ఈ నెల 25న దేశవ్యాప్త ఆందోళనదినంగా పాటించాలని ఎస్ఎఫ్ఐతో సహా విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయి. గురువారం ఈ మేరకు మయూఖ్ బిస్వాస్ (ఎస్ఎఫ్ఐ), విక్కీ మహేసరి (ఏఐఎస్ఎఫ్), సౌమ్యద్వీప్ సర్కార్ (ఏఐఎస్బీ), నౌఫాల్ ఎండీ సఫియుల్లా (పీఎస్యూ) ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి నేత అనీష్ సీఏఏ, ఎన్ఆర్సీ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పాడు. ఇటీవల సేవ్ అలియా యూనివర్సిటీ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నారు.