Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని భారత ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఆదేశాల వచ్చేవరకూ ఈ నిషేధం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సోమవారం ప్రకటించింది. 'తరుపరి ఉత్తర్వులు విడుదలయ్యే వరకూ షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సర్వీసులపై నిషేధాన్ని పొడిగించాలని కాంపిటెండ్ అథారిటీ నిర్ణయించింది' అని డిజిసిఎ పేర్కొంది. అయితే ఎయిర్ బూబుల్ కుదుర్చుకున్న దేశాలకు, ప్రత్యేకంగా ఆమోదం పొందిన విమాన సర్వీసులకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో 2020 నుంచి అంతర్జాతీయ పాసింజర్ విమాన సర్వీసుల్ని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.