Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీఏలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : కుల ప్రాతిపదికన సాయుధ బలగాలను వేరు చేయలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విముఖత వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందర్లతో కూడిన ధర్మాసనం ఎన్డీఏలో మహిళల చేరిక అంశంపై వ్యవహరిస్తోందని, కుల ఆధారిత రిజర్వేషన్ల కోసం చేసిన అభ్యర్థనను తాము పరిష్కరించబోమని స్పష్టం చేసింది. ఎన్డీఏలో మహిళల చేరికకు సంబంధించిన కుష్ కల్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ధర్మాసనం పరిశీలిస్తోందని, ఇందులో కైలాస్ మోర్ అనే వ్యక్తి కుల ఆధారిత కోటా కోరుతూ పిటిషన్(ఇంటర్వెన్షన్ అప్లికేషన్)ను దాఖలు చేశారు. ''ఇక్కడ ఉపాధి సూత్రాలను వర్తింపజేయలేం. సాయుధ దళాలు ఒక సజాతీయ యూనిట్. మీరు వాటిని కులం ఆధారంగా వేరు వేయలేరు'' అని జస్టిస్ ఎస్కె కౌల్ అన్నారు.
ప్రస్తుతం లింగ (జండర్) సమస్యపై దృష్టి సారించామని, ఇతర అంశాల్లోకి వెళ్లేందుకు విముఖత చూపుతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఆ సమయంలో లింగ సమస్యలను మాత్రమే పరిష్కరించాలనే ఉద్దేశాన్ని వ్యక్త పరిచేటప్పుడు సామాజిక విప్లవానికి సమయం పడుతుందని పేర్కొంది. ''మేము లింగ సమస్యలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాం. సామాజిక విప్లవం రాత్రికి రాత్రే రాదు. దీనికి సమయం పడుతుంది. మొదటి చాప్టర్లో లింగ సమస్యను తీసుకున్నాం. దాన్ని పూర్తి చేయనియండి'' అని జస్టిస్ కౌల్ అన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలైకి వాయిదా వేసింది. 2021 ఆగస్టులో ఎన్డిఎ నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రక్షణ మంత్రిత్వ శాఖ దరఖాస్తును దాఖలు చేసింది.