Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా ఐదు సెషన్లలో లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం పతనాన్ని చవి చూశాయి. వరుస ర్యాలీ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ఆసియా మార్కెట్లతోనూ ప్రతికూలత తదితర కారణాల నేపథ్యంలో సూచీలు నష్టపోయాయి. తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 709 పాయింట్లు కోల్పోయి 55,777 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయి 16,663కు పడిపోయింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.68 శాతం, 0.88 శాతం చొప్పున తగ్గాయి.