Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా ఎండి సలీం ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర 26వ సీపీఐ(ఎం) మహాసభ కోల్కతాలో జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలు గురువారం ముగిశాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బిమన్ బసు, హన్నన్ మొల్లా, తపన్ సేన్, నీలోత్పల్ బసు తదితరులు పాల్గొన్నారు. 80 సభ్యులతో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక అయింది. నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎండి సలీం ఎన్నిక య్యారు.