Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- 6-12వ తరగతి విద్యార్థులకు బోధన
గాంధీనగర్ : గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్ట్గా భగవద్గీతను తీసుకురానున్నట్ల్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘని వెల్లడించారు. కొత్త విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లో భగవత్ గీత బోధించబడుతుందని తెలిపారు. పాఠశాల విద్యలో భారతీయ సంస్కృతి, విజ్ఞాన వ్యవస్థను చేర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. భగవద్గీతలో ఉన్న విలువలు, సూత్రాలను పిల్లల అవగాహన, ఆసక్తి కలిగే విధంగా 6-12వ తరగతిలో ప్రవేశపెడుతున్నామ న్నారు. స్కూల్లో ప్రార్థనా కార్యక్రమాల్లోనూ భగవద్గీత శ్లోకాలు పఠించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. 6, 7, 8 తరగతులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో.. 9 నుంచి 12 తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే విద్యను కాషాయీకరించాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కాగా, ఈ నిర్ణయంపై లౌకికశక్తులు, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి.