Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఉక్రెయిన్లో బాంబు దాడిలో మరణించిన కర్ణాటక వైద్య విద్యార్థి నవీన్ మృతదేహం సోమవారం స్వదేశానికి చేరుకుంది. ముందుగా బెంగళూరుకు ప్రత్యేక విమానంలో వచ్చిన మృతదేహమాన్ని తరువాత ధర్వాడ్ జిల్లాలోని నవీన్ స్వగ్రామం చల్లాగిరికి తరలించారు. మృతదేహం వద్ద నవీన్ తల్లి విజయలక్ష్మీ, అతని సోదరుడు హర్షా, ఇతర బంధువులు, గ్రామస్తులు విలపించిన తీరు అందర్నీ కలిచి వేసింది. తరువాత నవీన్ మృతదేహాన్ని దవనగిరి మెడికల్ కాలేజ్కు అందచేశారు.