Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 రోజుల్లో రూ.5.60 పెంపు
న్యూఢిల్లీ : ఇంధన ధరల పెరుగుదల ఆగటం లేదు. బుధవారం దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై సుమారుగా రూపాయి వరకు ధరలు పెరిగాయి. హైదరాబాద్లో లీ.పెట్రోల్ ధర రూ.114.52, డీజిల్ ధర రూ.100.71కు చేరుకున్నాయి. నగరంలో డీజిల్ ధర వంద రూపాయలు దాటడం ఇదే మొదటిసారి. ఇంధన ధరలు ఈ రీతిగా పెరగటం వాహనదారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత 9 రోజుల్లో ఇంధన ధరలు 8సార్లు పెంచగా, దాంతో లీటర్ పెట్రోల్ రూ.5.60, డీజిల్పై రూ.5.60 పెంపు నమోదైంది. ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో లీ.పెట్రోల్ రూ.101.21, డీజిల్ రూ.92.27, ముంబయిలో పెట్రోల్ రూ.115.88, డీజిల్ రూ.100.10కు పెరిగాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులను కలుపుకొని ఇంధన ధరలు బుధవారం దాదాపు రూపాయి వరకు పెరిగాయని సమాచారం. మార్చి 22 నుంచి ధరల పెంపుకు కేంద్రం తెరలేపింది. జూన్ 2017 నుంచి ఇంధన ధరల్లో మార్పు రోజువారీ పద్ధతిలో నిర్ణయిస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, డాలర్-రూపాయి మారకంలో తేడాను పరిగణలోకి తీసుకొని ధరల నిర్ణయం చేపడుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ధరల పెంపు కొనసాగుతుందని సమాచారం.