Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా కె.బాలకృష్ణన్ తిరిగి ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర 23వ మహాసభలో మధురైలో మూడు రోజుల పాటు జరిగాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు జి.రామకృష్ణన్ హాజరయ్యారు. 80 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. రాష్ట్ర కార్యదర్శిగా కె.బాలకృష్ణన్ ఎన్నికయ్యారు. 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నిక అయింది.
అండమాన్ నికోబార్ దీవుల కార్యదర్శిగా డి.అయ్యప్పన్
సీపీఐ(ఎం) అండమాన్ నికోబర్ దీవుల కార్యదర్శిగా డి.అయ్యప్పన్ ఎన్నిక అయ్యారు. అండమాన్ నికోబర్ దీవుల 11వ మహాసభ పోర్ట్ బ్లెయిర్లో అతుల్ స్మృతి సమితి (బెంగాలీ క్లబ్), కామ్రేడ్ మహ్మద్ అమీన్ నగర్లో జరిగాయి. ఈ మహాసభకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు జి.రామకృష్ణన్ హాజరయ్యారు. 15 మందితో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. ఏడుగురుతో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నిక అయింది. కార్యదర్శిగా డి.అయ్యప్పన్ ఎన్నిక అయ్యారు.