Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇకె నయనార్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
సుదీర్ఘకాలం ప్రజాజీవితం గడిపి, పార్టీలో కేంద్రకమిటీ, పొలిట్బ్యూరో స్థాయిలో సేవలందించి తాజాగా వయోభారం, ఇతర కారణాలతో రిలీవ్ అయిన సీనియర్ నాయకులకు మహాసభ ఘనంగా సత్కారం చేసి వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా మహాసభలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రెడ్సెల్యూట్ నినాదాలో మారుమోగింది. ఎస్.రామచంద్రన్ పిళ్ళై,బిమన్బసు, హన్నన్మొల్లాలను సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన సీతారాంఏచూరి ఎర్రశాలువాలు కప్పి సత్కరించారు. భవిష్యత్లోనూ వారి సేవలు అందుబాటులో ఉంటాయన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేంద్రకమిటీ సభ్యులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి బాధ్యతలు నిర్వహించిన పి. మధు, ఎస్ . వీరయ్యలు కూడా తాజా మహాసభలో రిలీవ్ అయ్యారు.