Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిన్నటి కన్నా 66శాతం అధికం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా క్రమంగా పెరుగుతున్నది. కేసుల వ్యాప్తిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం 2,067 కేసులు నమోదు కాగా, 40 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం కన్నా 66 శాతం అధికమని అన్నారు. 480 యాక్టివ్ కేసులు వుండగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 12,340కి గా ఉందని తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త ఆదేశాలను జారీచేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాంలలో కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కు ధరించడం తప్పనిసరని తెలిపింది. ఢిల్లీలో 632 కేసులు నమోదు కాగా, వారం ప్రారంభంలో 7.72గా ఉన్న పాజిటివిటీ రేటు 4.42 శాతానికి తగ్గింది. మహారాష్ట్రలో 137 కేసులు నమోదు కాగా, కరోనాతో ముగ్గురు మరణించారు.