Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...
  • ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం
  • హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
  • విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
  • నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

Wed 25 May 01:22:08.447206 2022

- మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు
అమలాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్‌ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురం భగ్గుమంది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సష్టించారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇండ్లకు నిప్పు పెట్టారు. అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిని వేలాదిగా చుట్టుముట్టిన ఆందోళనకారులు ఇంటి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి ఇంటివద్ద ఉన్న ఎస్కార్ట్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని కూడా తగలబెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు తరలించారు. మరోవైపు, అమలాపురంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అమలాపురంలో పరిస్థితులను ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు సమీక్షిస్తున్నారు. అక్కడికి అదనపు బలగాలు తరలిస్తున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం, కాకినాడ, ప.గో, కష్ణా జిల్లాల నుంచి బలగాలను రప్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
దురదృష్టకరం : మంత్రి విశ్వరూప్‌
             దీనిపై మంత్రి విశ్వరూప్‌ స్పందిస్తూ.. 'నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్‌ చేశాయి. అంబేద్కర్‌ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి' అని మంత్రి విశ్వరూప్‌ కోరారు.
ప్రేరేపించే శక్తులు ఉండొచ్చు : మంత్రి సజ్జల రామకష్ణారెడ్డి
             జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని వినతులు వచ్చాయి. విస్తతంగా డిమాండ్‌ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అంబేద్కర్‌ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ. దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చని సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు.
అంబేద్కర్‌ కోనసీమ పేరు వివాదాస్పదం చేయొద్దు : సీపీఐ(ఎం)
             డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేయొద్దని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ కోరింది. అంబేద్కర్‌ కోనసీమ పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలు జరగడాన్ని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టారనీ, కోనసీమ జిల్లాకు తదనంతరం అంబేద్కర్‌ పేరును నామకరణం చేశారని పేర్కొన్నారు. బీజేపీ మినహా సీపీఐ(ఎం) సహా అన్ని రాజకీయ పార్టీలూ అంబేద్కర్‌ పేరు పెట్టడాన్ని బల పర్చాయని తెలిపారు. దీనిపై కొన్ని స్వార్థపర శక్తులు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి వివాదం చేయడాన్ని సీపీఐ(ఎం) ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని నివారించేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవ హరించి ఉండాల్సిందని తెలిపారు. అమలాపురంలో శాంతి సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.