Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు
  • భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు

Wed 25 May 04:17:13.481093 2022

- పాత పెన్షన్‌ విధానమే కావాలి
- మంత్రుల కమిటీతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు
అమరావతి : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఒపిఎస్‌)ను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తామని హామీ ఇస్తేనే మరోసారి ప్రభుత్వం పిలిచే చర్చలకు వస్తామని చెప్పాయి. సిపిఎస్‌ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంప్రదింపుల కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించింది. ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. ఒపిఎస్‌ పునరుద్ధరణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని సంఘాలకు మంత్రులు చెప్పారు. అధికారులు గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జిపిఎస్‌)పై వేసిన లెక్కల ఆధారంగా రిటైర్డ్‌మెంటు తరువాత 33 శాతం ఇవ్వగలమని తెలిపారు. జిపిఎస్‌ అమలులో మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. సిపిఎస్‌పై ఉద్యోగులకు నచ్చజెప్పాలని సంఘాల నాయకులకు సలహా ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మంచి అవకాశం ఇస్తున్నామని, దీనిని అంగీకరించాలని కోరారు. ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్‌ మాట్లాడుతూ.. 2100 సంవత్సరం నాటికి ప్రభుత్వానికి పెన్షన్‌ భారంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని, పెన్షన్‌పై పెట్టే ఖర్చు పెరుగుతుందన్నారు. జిపిఎస్‌లో మినిమం గ్యారెంటీ ఇస్తామన్నారు. సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ను అంగీకరించబోమని సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. జిపిఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన లెక్కలు ఊహాగానమని వ్యతిరేకించారు. 2,100 సంవత్సరం నాటికి ప్రభుత్వ ఆదాయం పెరగదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అప్పటికీ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయా అని నిలదీశారు. సిపిఎస్‌లో పిఎఫ్‌, గ్రాట్యూటీ ఉండదని, సిపిఎస్‌ డబ్బులను ప్రైవేట్‌ కంపెనీలో పెట్టారని, జిపిఎస్‌లో ఏం చేస్తారో స్పష్టత లేదన్నారు. చత్తీస్‌గఢ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలు రద్దు చేశాయని చెప్పారు. తాము జిపిఎస్‌ అమలుపైనే ఆలోచన చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సిపిఎస్‌ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, సామాజిక భద్రత కోణంలో చూడాలని యుటిఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎపి ఎన్‌జిఒ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌ ప్రసాద్‌, ఎస్‌టియు అధ్యక్షులు సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆందోళన
            ఒపిఎస్‌ అమలు చేయాలని ఉద్యోగులు సచివాలయంలో ఆందోళన నిర్వహించారు. సిపిఎస్‌, జిపిఎస్‌ వద్దంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఒపిఎస్‌పైనే చర్చించాలని కోరుతూ ఎన్‌జిఒ సంఘాల నాయకులకు పూలు అందించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.