Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేనాడ్లోని ఆయన నియోజకవర్గ కార్యాలయంపై కొందరు యువకులు చేసిన దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఇది తప్పుడు ధోరణి అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికీ తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందనీ, అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలని విజయన్ ట్వీట్ చేశారు. వేనాడ్ ఘటనను సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి కూడా తీవ్రంగా ఖండించారు.