Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకులు మహ్మద్ జుబేర్కు యూపీలోని లఖింపూర్ ఖేరీల గల స్థానిక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మతాల మధ్య శుత్రుత్వాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన కేసులో న్యాయస్థానం తాజా ఆదేశాలను జారీ చేసింది. సీతాపూర్ జిల్లా జైలులో ఉన్న జుబేర్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ విచారణకు హాజరయ్యారు. జుబేర్ను ప్రశ్నించటానికి 14 రోజుల కస్టడీని కోరుతూ లఖింపూర్ ఖేరీ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం రేపు (బుధవారం) విచారణ చేపట్టనున్నట్టు అడిషనల్ ప్రాసిక్యూటర్ ఆఫీసర్ (లఖింపూర్ ఖేరీ) అవదేశ్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టులో హాజరు కావటానికి నేడు (మంగళవారం) జుబేర్ను ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశమున్నదని లఖింపూర్ ఖేరీ ఎస్పీ సంజీవ్ కుమార్ చెప్పారు.