Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ విద్యుత్ సంస్థలపై సుప్రీం కోర్టు అసహనం
న్యూఢిల్లీ : ఏపీ విద్యుత్తు ఉద్యోగులను కోర్టు ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నప్పటికీ సీనియారిటీ లెక్కింపు విషయంలో నిర్లక్ష్యం వహించినందు కు తెలంగాణ విద్యుత్ సంస్థలపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. జైలుకు పంపాకా ఆదేశాలు అమలు చేస్తారా? అని ప్రశ్నిం చింది. ఏపీ నుంచి విధుల్లోకి తీసుకున్నప్పటికీ సీనియారిటీ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు 84 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నామని, బకాయిలు చెల్లించేశా మని తెలంగాణ విద్యుత్ సంస్థల తరపు సీనియర్ న్యాయవాదులు గిరి, రంజి త్ కుమార్, రాకేష్ ద్వివేదిలు కోర్టుకు తెలిపారు. ఆదేశాలు అమలు అయినట్లే గా అని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించగా.. ఉద్యోగుల తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్, న్యాయవాది రాజ గోపాలరావులు అభ్యంతరం తెలిపారు. ఏపీ నుంచి విధుల్లోకి తీసుకున్న సీనియర్ల కన్నా తెలంగాణలోని జూనియర్లకు ఎక్కువ వేతనం వస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంక్రి మెంట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏపీలో ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తు న్నారని వివరించారు. అంతర్రాష్ట్ర సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఏమ య్యాయని తెలంగాణ న్యాయవాదులను జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. పదోన్నతులు కల్పించాలంటే సీనియారిటీ లెక్కబెట్టాలని, నాలుగు వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్తు సంస్థల తరపు న్యాయవాదులు తెలి పారు. గతంలోనూ నాలుగు వారాలు అడిగారు కదా, ఇంకా ఎందుకు చేయ లేదని ధర్మాసనం ప్రశ్నించింది. రెండేండ్ల కిందటి జీతాలు ఇప్పుడు ఇస్తారా? అని అసహనం వ్యక్తం చేసింది. సర్వీస్ బుక్లు పరిశీలించాలని సీనియర్ న్యాయవాది గిరి చెప్పగా కస్టడీకి పంపాల్సి ఉంటుందని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు. సర్వీసు బుక్లు ఇవ్వాలని కోరినా ఇంకా అందలేదనీ, కోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని గిరి తెలిపారు. ఇంకా ఎప్పు డు పాటిస్తారు? జైలు పంపాకా పాటిస్తారా? అని జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నిం చారు. తెలంగాణ విద్యుత్తు సంస్థలకు నాలుగు వారాలు గడువు ఇచ్చిన ధర్మాసనం సర్వీసు బుక్లు ఇవ్వాలని ఏపీ విద్యుత్తు సంస్థల్ని ఆదేశించింది.